భూభారతి చట్టంతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

భూభారతి చట్టంతో రైతులకు మేలు

Apr 25 2025 1:13 AM | Updated on Apr 25 2025 1:13 AM

భూభారతి చట్టంతో రైతులకు మేలు

భూభారతి చట్టంతో రైతులకు మేలు

నర్వ/ఊట్కూర్‌: ధరణి స్థానంలో మేలైన చట్టాన్ని తేవాలన్న ఉద్దేశ్యంతో.. భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ చట్టంతో భూసమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వ, ఊట్కూర్‌లో అవగాహన సదస్సులు నిర్వహించగా.. కలెక్టర్‌, ఎమ్మెల్యే ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధరణిలో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. కొత్త చట్టంలో 4,5,6 సెక్షన్లు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని, సాదాబైనామాల పరిష్కారానికి ప్రత్యేక ప్రొవిజన్‌ ఉందని వివరించారు. గతంలో అన్ని అధికారాలు కలెక్టర్‌ వద్దనే ఉండేవని, ఇప్పుడు తహసీల్దార్‌, ఆర్డీఓ, రెవెన్యూ కలెక్టర్‌ స్థాయిలో అధికారాలు ఉన్నాయని, రైతులకు న్యాయం జరగనప్పుడు పై అధికారులకుఽ అప్పిల్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

చారిత్రాత్మకం..

ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ఓ చారిత్రాత్మకమన్నారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 10 నెలల పాటు ఆహర్నిశలు కృషిచేశారని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి ద్వారా రైతుకు–భూమికి ఉన్న బంధాన్ని తెంపిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెంపిన బంధాన్ని కలిపిందని అన్నారు. గతంలో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సి ఉండేదని, భూ భారతి ద్వార తహాసీల్దార్‌ స్థాయిలో సమస్యలు పరిష్కామవుతాయని అన్నారు. దేశంలోనే లేని విధంగా భూఆధార్‌కార్డుతో పాటు సర్వే మ్యాప్‌ను ప్రభుత్వమే అందించి పాస్‌బుక్కులో పొందుపర్చేవిదంగా చట్టం రూపొందించారన్నారు.

క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం

మద్దూరు: భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చే భూ సమస్యలను క్షత్రేస్థాయిలోనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. మద్దూరు మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను అడిషన్‌ కలెక్టర్‌ రెవెన్యూ బెన్‌షాలోంతో కలిసి సందర్శించారు. ఇప్పటి వరకు పైలెట్‌ ప్రాజెక్టు క్రింద మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఏఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే సదస్సులను టీంలు పెంచాలన్నారు. రెవెన్యూ గ్రామాల వారిగా వచ్చిన సమస్యలను కేటగిరి వారిగా విభజించాలని, అలాగే సదస్సులు పూర్తయ్యే వరకు ఆర్‌డీఓ రాంచందర్‌నాయక్‌ ఈ మండలంలోనే ఉండాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహేష్‌గౌడ్‌, డీటీ వాసుదేవరావ్‌, ఆర్‌ఐలు, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement