ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలి

Apr 24 2025 12:45 AM | Updated on Apr 24 2025 12:45 AM

ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలి

ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలి

నారాయణపేట/మరికల్‌: ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకలు ప్రతి ఇంటికి చేరాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మరికల్‌ మండలంలోని అప్పంపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు అందరికి సంక్షేమ పథకలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వనికే దక్కిందన్నారు. అకాల వర్షాలకు రైతులు ఎవరూ భయపడవద్దన్ని ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఖచ్చితంగా అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులను ఎంపిక చేసి ప్రభుత్వన్ని చెడ్డపేరు తీసుకరావద్దన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు సూర్యమోహన్‌రెడ్డి, ఓబీసీ జిల్లా చైర్మన్‌ కృష్ణయ్య, వెంకట్రామారెడ్డి, వీరన్న, వినితమ్మ, సత్యన్న, నారాయణరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.

అమరులకు నివాళులు

కాశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అమాయకులైన ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఉగ్రవాదన్ని ఉక్కుపాదం తో అణిచివేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, సీనియర్‌ నాయకులు గందే చంద్రకాంత్‌, వకీల్‌ సంతోష్‌,మనోహర్‌ గౌడ్‌, కోట్ల రవీందర్‌ రెడ్డి,మహిమూద్‌ ఖురేషి, సతీష్‌ గౌడ్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement