రోగులకు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు అందుబాటులో ఉండాలి

Apr 22 2025 1:10 AM | Updated on Apr 22 2025 1:10 AM

రోగుల

రోగులకు అందుబాటులో ఉండాలి

ధన్వాడ: వైద్యసిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. సౌభాగ్యలక్ష్మి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు, ఈడీడీ క్యాలెండర్‌, ప్రసవాల నివేదికలను పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని గదులను తనిఖీ చేశారు. ఆమె వెంట వైద్యులు డా. అనుషా, సింధుజ, సూపర్‌వైజర్‌ కతలప్ప తదితరులు ఉన్నారు.

మత్తు నిర్మూలనే లక్ష్యం

కోస్గి రూరల్‌: జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్‌ స్నైపర్‌ పోలీస్‌ జగిలంతో తనిఖీలు చేపడుతున్నట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు కిరాణ దుకాణాలు, పాన్‌షాప్‌లు, పంటపొలాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టి మాట్లాడారు. పట్టణంలో ఎక్కడైనా, ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు, రవాణా చేస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ ఆంజనేయులు, నార్కొటిక్‌ స్నైపర్‌ డాగ్‌ విక్కి, పరమేష్‌ తదితరులు ఉన్నారు.

‘అంబేడ్కర్‌ను

అవమానించింది కాంగ్రెస్సే’

నారాయణపేట రూరల్‌: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌పార్టీ ఆది నుంచి అడుగడుగునా అవమానించిందని.. బీజేపీ అభిమానించి ఆరాధిస్తోందని రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్‌చార్జ్‌, మాజీ ఎంపీ మునుస్వామి అన్నారు. అంబేడ్కర్‌ జయంతి వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనన్నారు. అంబేడ్కర్‌ను రాజ్యాంగ కమిటీలో నియమించడానికి నెహ్రూకు సైతం ఇష్టం లేదని గుర్తు చేశారు. 60 ఏళ్ల పాలనలో భారతరత్న ఇవ్వకుండా అవమానించింది కూడా కాంగ్రెస్‌పార్టీనని తెలిపారు. రాజ్యాంగాన్ని 108 సార్లు సవరించి ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలనకు వినియోగించుకుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం కొన్ని సవరణలు మాత్రమే చేసిందని.. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నది మోదీ ప్రభుత్వమేనని వివరించారు. ఎస్సీ వర్గం ప్రజలకు మరింత చేరువై రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోని ఎస్సీవాడల్లో పార్టీ ముఖ్య నాయకులు, బూత్‌ కమిటీల అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. సమావేశంలో నాయకులు నాగూరావునామాజీ, కొండయ్య, కొప్పి బాషా, విజయ్‌కుమార్‌, కృష్ణ, నర్సన్‌గౌడ్‌, సుజాత, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్‌ వినోద్‌, మండల అధ్యక్షురాలు జ్యోతి సాయిబన్న, జిల్లా పార్టీ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

మొక్కజొన్న క్వింటా రూ.2,266

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్‌ యార్డుకు సోమవారం భారీగా మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 3,508 క్వింటాళ్ల మక్కలు విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,266, కనిష్టంగా రూ.1576 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో వరి సోనారకం గరిష్టంగా రూ.2,179, కనిష్టంగా రూ.1,712, హంస రకం గరిష్టంగా రూ.1,978, కనిష్టంగా రూ.1,661, ఆముదాలు గరిష్టంగా రూ.6,018, కనిష్టంగా రూ.6,001గా ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు 5 వేల బస్తాల వరి ధాన్యం అమ్మకానికి వచ్చింది.

రోగులకు అందుబాటులో ఉండాలి 
1
1/2

రోగులకు అందుబాటులో ఉండాలి

రోగులకు అందుబాటులో ఉండాలి 
2
2/2

రోగులకు అందుబాటులో ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement