వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి

Apr 13 2025 12:32 AM | Updated on Apr 13 2025 12:32 AM

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి

మక్తల్‌: వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని గడ్డంపల్లిలో శనివారం వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించగా.. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కర్ణాటకలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో రాష్ట్రంలోనూ ఎస్టీ జాబితాలోకి మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని, తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, సబ్సిడీపై రుణాలు ఇచ్చేలా చూస్తామన్నారు. అంతకుముందు గ్రామస్తులు రెండు రోజుల నుంచి వాల్మీకి విగ్రహానికి వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు గట్టుతిమ్మప్ప, బాలక్రిష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంతు, చంద్రాంత్‌గౌడ్‌, నర్సింహగౌడ్‌, గణేష్‌కుమార్‌, నారాయణరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, మండలంలోని భూత్పుర్‌లో డీఆర్‌డీఏ ఐకేపి ఆధ్వర్యంలో వరి కోనుగోలు కేంద్రాన్ని మక్తల్‌ ప్రారంబించారు.

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

నర్వ: రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరీ అన్నారు. శనివారం సీపూర్‌లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యాసంగి సాగులో కోతలు ప్రారంభానికి కంటే ముందుగానే వరిని సాగుచేసిన రైతులు ఎలాంటి అధైర్యపడకుండా కనీస మద్దతు ధర రూ.2300 చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులయ్య, సింగిల్‌ విండో చైర్మెన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రేస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు బాలక్రిష్ణారెడ్డి, చంద్రకాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement