ఇండియన్ గ్యాస్ను సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆదివారం ఆస్పరిలో బస్టాండ్ దగ్గర సిలిండర్లును క్యూలో పెట్టి ఉంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి దగ్గరకు గ్యాస్ సరఫరా చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా ఆస్పరిలో మాత్రం జరగడం లేదని వినియోగదారులు అవేదన చెందుతున్నారు. ఆదివారం 250 మంది గ్యాస్ కోసం సిలిండర్లు క్యూలో పెట్టి వేచి ఉండగా గ్యాస్ ఏజెన్సీవారు 80 మందికి మాత్రమే ఇచ్చినట్లు వినియోగదారులు తెలిపారు.
–ఆస్పరి


