దొర్నిపాడు: జాతీయస్థాయి షటిల్, తైక్వాండో క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన ఎద్దుల ఎపఫ్రా అఖిల్ ప్రకాశ్ అనే విద్యార్థి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపాడు. దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 573 మార్కులు సాధించాడు. అఖిల్ అమ్మ జ్యోతి రత్నకుమారి ఆళ్లగడ్డ తహసీల్దార్గా, తండ్రి దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(పీఎస్) విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూనే తమ కుమారుడిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివించి ఆదర్శంగా నిలిచారు.


