
వెండి బిస్కెట్లు విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా జగలూరుకు చెందిన యు.లోకమూర్తి 10 వెండి బిస్కెట్ల(5 కేజీలు)ను విరాళంగా సమర్పించారు. బుధవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని అమ్మవారి ఉప ప్రధానార్చకులు విజయకుమారాస్వామి, పర్యవేక్షకులు ఎం.రవికుమార్, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ రామానాయుడు, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేశారు.