
ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే
ఊరూరా బెల్ట్షాపులు.. బాటిల్పై రూ.10–20 అ‘ధన’ం
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి
ప్రశ్నించారు.. వదిలేశారు!
‘జత్వానీ’పై పెట్టిన శ్రద్ధ
సుగాలి ప్రీతి కేసుపై ఏదీ!?
బాలీవుడ్ నటి జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేకపోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ఈ ఘటన జరిగినా, ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా జనసేన, టీడీపీ ఈ అంశాన్ని వాడుకున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ప్రీతి తల్లి పార్వతి కలిసినా ప్రయోజనంలేకపోయింది. ఈ విషయమై పార్వతి స్వయంగా మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రూ.1635.50 కోట్లు
( ఆడబిడ్డ నిధి అమలు చేయకపోవడంతో మహిళలకు వాటిల్లే నష్టం )
రూ.593.47 కోట్లు
( అన్నదాత సుఖీభవ అమలు చేయకపోవడం వల్ల రైతులకు కలిగే నష్టం )
సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ కూటమి పాలనలో అవినీతి తాండవిస్తోంది. బహిరంగంగానే నేతలు, పార్టీ శ్రేణులు అక్రమాలకు తెగబడ్డారు. నేటితో సార్వత్రిక ఫలితాలకు సరిగ్గా ఏడాది. ఈ ఏడాది ‘కూటమి పాలన’ను విశ్లేషిస్తే మోసం, దగా మినహా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇట్టే తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 18,712 వలంటీర్లను తొలగించి రోడ్డున పడేయడం, సూపర్సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం.. చివరకు పింఛన్, రేషన్ కావాలన్నా సచివాలయాల చుట్టూ, రేషన్ దుకాణాల చుట్టూ తిరిగే దారుణ పరిస్థితి కల్పించడం గమనార్హం. ఆదోని, శ్రీశైలం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ, కర్నూలు, పాణ్యంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఇసుక, గ్రావెల్ దందా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఆదోనిలో డబ్బులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే అనుచురులు ఏకం గా భౌతిక దాడులకు దిగారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గురజాల జయరాముడు, రాయచోటి నాగిరెడ్డి ఇద్దరూ ఇసుక దోపిడీకి తెగబడిన ఆడియో కూడా వైరల్ అయింది. ‘సీఐకి రూ.50వేలు ఇచ్చినా, ఎమ్మెల్యేకి చెప్పి ఇసుక తోలుతున్నా, దమ్ముంటే రమ్మను జయరాం’ అని నాగిరెడ్డి బహిరంగంగానే బెదిరించారు. ఆళ్లగడ్డలో ఇసుక కావాలంటే ఏ పల్లెకు వెళ్లినా, ఎంతకు కొనుగోలు చేసినా ట్రిప్పునకు రూ.2వేల చొప్పున బీట్యాక్స్ చెల్లించాల్సిందే. పాణ్యం నియోజకవర్గం పూడిచెర్లతో పాటు పలు చోట్ల గ్రావెల్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండల టీడీపీ నేతల ఫోన్ సంభాషణలో ‘ఆపోజిట్ వాళ్లు ఎవడైనా బండి ఆపితే టిప్పర్తోనే కొడతా.. రమ్మను’ అని మట్టి అక్రమ తరలింపు విషయంలో బరితెగించి మాట్లాడటం గమనార్హం.
‘పచ్చ’పాతమే..
మంత్రి టీజీ భరత్ తన వ్యవహార శైలి మార్చుకోకపోతే తానే రంగంలోకి వస్తానని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఇటీవల బహిరంగంగానే హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉండడం లేదని.. ఆధార్ కార్డు చూసి పనులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా సేవ చేయాల్సిన నేతల ‘పచ్చ’పాతం ప్రభాకర్ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది.
పాలనలో
‘విశ్వసనీయత’
వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 20న ప్రమాణస్వీకారం చేశారు. జూలై 12న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 99శాతం ప్రవేశపెట్టారు. ఐదేళ్లూ వాటికి నిధులు కేటాయించారు. మేనిఫెస్టోకు విశ్వసనీయత, ప్రజలకు మాట ‘చెప్పామంటే...చేయాలంతే’ అనేలా పాలన సాగించారు. ఐదేళ్లలో ముఖ్య పథకాలకు జిల్లాకు రూ.10,136.85కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
అదుపు తప్పిన శాంతిభద్రతలు
జిల్లా ఎస్పీల చేతుల్లో ఏ అధికారం లేదు అన్న భావన సీఐ, ఎస్ఐలలో బలంగా పాతుకుపోయింది.
ఇటీవల ఏసీబీకి చిక్కిన నాలుగో పట్టణ సీఐ మధుసూదన్గౌడ్ టీడీపీ ఏజెంట్లా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
వైఎస్సార్సీపీ నేతలతో పాటు ఏకంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఏదైనా సమస్య కోసం ఫోన్ చేసినా, స్టేషన్కు వెళ్లినా బాహాటంగానే ‘మీది ఏది జరగదు. మీ కు తెల్సు! ఎందుకు స్టేషన్కు వస్తారు!’ అని బా హాటంగానే మాట్లాడారంటే ‘లా అండ్ ఆర్డర్’ ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తోంది.
ఆళ్లగడ్డ పరిధిలోని చెన్నంశెట్టిపల్లెలో రవీంద్ర అనే వ్యక్తి ట్రాక్టర్ తెచ్చుకుని బాడుగకు ఇసుక తోలుతుంటే హరిప్రసాద్ అనే ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. తన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపినా ట్రాక్టర్ ఆపి వేధించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.
పత్తికొండ సీఐ జయన్న అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వేధింపులు తాళలేక ప్రవీణ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వైఎస్సార్సీపీ ఉద్యమబాట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రజాగ్రహానికి గురైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పిల్లల చదువులు, రైతుల వ్యవసాయం అన్నీ సంక్షోభంలో పడ్డాయి. దీంతో ప్రజాక్షేత్రంలో ఆందోళన బాట పట్టింది. గతేడాది డిసెంబర్ 13న రైతులకు మద్దతుగా ‘రైతు పోరు’, అదే నెల 27న విద్యుత్ చార్జీల పెంపుపై కలెక్టరేట్ల ముట్టడి, ఈ ఏడాది మార్చి 12న యువపోరుతో ఆందోళన నిర్వహించారు. ఏడాదిలో 61మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయాన్ని కూటమి ప్రభుత్వం ఏస్థాయిలో నిర్లక్ష్యం చేసిందో ఇట్టే తెలుస్తోంది.
నేటితో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఏడాది
‘సూపర్ సిక్స్’ హామీలను పూర్తిగా గాలికొదిలిన చంద్రబాబు
ఊరూరా బెల్ట్షాపులతో ఏరులై పారుతున్న మద్యం
మద్యం షాపులు పూర్తిగా టీడీపీ నేతల చేతుల్లోనే..
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అడుగడుగునా అవినీతి
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాదిలో 61 మంది రైతుల ఆత్మహత్య
నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ
రూ.6,609.28 కోట్లు
( సూపర్సిక్స్కు మంగళం పాడటంతో ఏడాదికి జిల్లాకు కలిగే నష్టం )
మద్యం పాలసీ ద్వారా కూటమి ప్రభుత్వం భారీగా దండుకుంటోంది. విపక్షపార్టీ నేతలకు దుకాణాలు వచ్చినా వారి నుంచి బలవంతంగా లాక్కుని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. తెలంగాణవాసులు వడ్డెంపూడి నరేశ్(షాపు నెంబర్ 36), విజయ్, భరత్ గౌడ్ (షాపు నెంబర్24), వింజమూరి కృష్ణారెడ్డి(షాపు నెంబర్ 22) దుకాణాలు దక్కాయి. వీరికి కోడుమూ రు టీడీపీ ఇన్చార్జ్ విష్ణువర్ధన్రెడ్డి, అనుచరుల నుంచి ఫోన్లో బెదిరింపులు వచ్చాయని, ఫోన్ నెంబర్తో సహా ముఖ్యమంత్రి, ఇన్చార్జ్, ఎకై ్సజ్, హోంమంత్రులకు, సీఎస్, కలెక్టర్కు మెయిల్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. తామూ టీడీపీ సానుభూతి పరుల మే అని ఇంత అన్యాయం ఏంటని ఫిర్యాదులో పే ర్కొన్నారు. ఈ ఉదాహరణలు చూస్తే జిల్లాలో మద్యం దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతుంది. గత 5 ఏళ్లలో ఏ పల్లెలో ఒక్క బెల్ట్దుకాణం లేదు. ఈ ఏడాది ప్రతీ పల్లెలో బెల్ట్షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు.
నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినోత్సవం
కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలకు వెన్నుపోటు పొడిచి పథకాలు అమలు చేయకపోవడంపై నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 14 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.
కర్నూలు (టౌన్): ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే అని నంద్యాల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కల్లూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అలవి కానీ హామీలను ప్రకటించి ఇప్పుడు ఏడాది పూర్తయినా ఏ ఒక్క సూపర్ సిక్స్ హామీని పూర్తిగా అమలు పరచలేదన్నారు. బాబు ఏడాది పాలన అట్టర్ప్లాప్ అయ్యిందన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేశారన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి భూముల రేట్లు, కరెంటు చార్జీల పెంచి పేదలు, మద్య తరగతి, సామాన్య ప్రజల నడ్డి విరిచారన్నారు. ఏడాదిలోనే చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏడాది పూర్తి అయినా నయాపైసా నిధులు విడుదల చేయలేదన్నారు. బుధవారం కల్లూరులో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. కల్లూరులోని తన నివాసం నుంచి కల్లూరు తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు.

ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే

ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే

ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే

ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే

ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే

ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే

ఏడాది కూటమి పాలనలో అన్నీ వైఫల్యాలే