ఇంటింటికీ మద్యం సరఫరా ఘనత బాబుది | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ మద్యం సరఫరా ఘనత బాబుది

Jun 4 2025 1:37 AM | Updated on Jun 4 2025 1:37 AM

ఇంటింటికీ మద్యం సరఫరా ఘనత బాబుది

ఇంటింటికీ మద్యం సరఫరా ఘనత బాబుది

● ఊరూరా బెల్ట్‌షాపులతో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువు ● జగనన్న, చంద్రబాబు పాలనలో తేడాను ప్రజలు గమనించాలి ● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతారెడ్డి, అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

చాగలమర్రి: కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్‌ పంపిణీని రద్దు చేసి ఇంటింటికి మద్యం సరఫరా చేస్తుందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతారెడ్డి, అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం వారు మాజీ ఎమ్మెల్యే లు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, పార్టీ నేత భూమా కిశోర్‌రెడ్డితో కలిసి తోడేండ్లపల్లె గ్రామాన్ని సందర్శించి ఇటీవల హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి చిత్ర పటానికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఊరూరా బెల్ట్‌షాపులతో మద్యం ఏరులై పారుతుందన్నారు. మద్యం మత్తులో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. తోడెండ్లపల్లె చిన్నారి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధానకార్యదర్శి షేక్‌ బాబులాల్‌, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, ఆళ్లగడ్డ ఎంపీపీ రాఘవేంద్రరెడ్డి, వ్యాపారవేత్త చక్రం ముల్లా షబ్బీర్‌ అహ్మద్‌, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌, రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు గణేష్‌రెడ్డి, మండల ప్రధానకార్యదర్శి శేషురమేష్‌, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ముల్లా ఖాదర్‌బాషా, సర్పంచ్‌లు బాలీశ్వరరెడ్డి, గోవిందయ్య, ఎంపీటీసీలు కె.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.

దిశ చట్టం నిర్వీర్యం..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళలకు రక్షణగా ప్రవేశ పెట్టిన దిశా చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతారెడ్డి విమర్శించారు. జగనన్న, చంద్రబాబు పాలనలో తేడాను ప్రజలు గమనించాలన్నారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి.. తమ్ముళ్లకు ఆదాయం వచ్చే పథకాలను మాత్రమే అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement