13న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

13న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

Jun 4 2025 1:37 AM | Updated on Jun 4 2025 1:37 AM

13న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

13న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఈ నెల 13న ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక అంశాలపై చర్చ కొనసాగుతుందన్నారు. సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాల సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తమకు కేటాయించిన సమాయానికి తప్పక హాజరు కావాలని సీఈఓ కోరారు.

833 అడుగులకు చేరిన శ్రీశైలం డ్యాం నీటిమట్టం

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 833.20 అడుగలకు చేరుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలంకు 10,378 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 3,775 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. కుడిగట్టు కేంద్రంలో 1.182 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 0.372 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 3,295 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌వాటర్‌ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 480 క్యూసెక్కులను వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 52.8918 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

‘పీఎం సూర్య ఘర్‌’సద్వినియోగానికి చర్యలు

పథకం అమలుపై సమీక్షలో జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల(న్యూటౌన్‌): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన సోలార్‌ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి పీఎం సూర్య ఘర్‌ పథకం అమలుపై ఏపీఎస్పీడీసీఎల్‌ ఇంజి నీర్లు, ఎనర్జీ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్‌ పథకం కింద నమోదు చేసుకున్న దరఖాస్తుల్లో 458 కన్వర్ట్‌ అయి సంబంధిత వెండర్‌ నుంచి కమీషనింగ్‌కు వెళ్లాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 97 వేల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సూర్యఘర్‌ సోలార్‌ ప్యానళ్ల కోసం పేర్ల నమోదు చేసుకున్నారన్నారు. అలాగే దరఖాస్తుదారులకు బ్యాంకుకు అనుసంధానం చేసి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాండురంగాపురం గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని ఈ పథకం కింద కు తీసుకురావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement