
పోస్టల్ కొత్త ఖాతాలకు స్పెషల్ డ్రైవ్
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో ‘ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు’ ద్వారా కొత్త ఖాతాలను తెరిచేందుకు ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ కొత్త ఖాతాలకు ఆధార్ను అనుసంధానం చేయడంతో పాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఇందులో భాగంగా కొత్త ఐపీపీబీ బ్యాంకు ఖాతాలను తెరవడం, ఇప్పటికే ఉన్న ఐపీపీ బీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్లను సులభతరం చేయడం ప్రాథమిక లక్ష్యమన్నారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న 15,365 ఖాతాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న 434 పోస్టాఫీసుల ద్వారా పునరుద్ధరణ జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం లబ్ధిదారులు సమీపంలోని పోస్టాఫీసులను సంప్రదించాలన్నారు.