ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డికి సన్మానం

May 1 2025 1:54 AM | Updated on May 1 2025 1:54 AM

ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డికి సన్మానం

ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డికి సన్మానం

నల్లగొండ: డీఈఓ కార్యాలయ అసిస్టెంట్‌ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డిని డీఈఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు డీఈఓ భిక్షపతి సన్మాన పత్రం అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ిపీఏగానూ సేవలు అందించిన ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని డీఈఓ ఆకాంక్షించారు. డీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి, జ్యోతి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బురి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, విద్యాశాఖ ఏడీ రమాచారి, ఏసీజీఈ యూసుఫ్‌ షరీఫ్‌, ఏఎంఓ రామచంద్రయ్య, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ సత్తెమ్మ, డీసీసీబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్‌, యేసు ఆదినారాయణ, సూపరింటెండెంట్‌ మోహన్‌, మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement