
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
● కాంగ్రెస్ నల్లగొండ జిల్లా పరిశీలకుడు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి
నల్లగొండ: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మక్తల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నల్లగొండ జిల్లా పరిశీలకుడు వాకటి శ్రీహరి అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికల్లో, పదవుల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జూకూరి రమేష్, అంకతి సత్యం, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి తదితరులు పాల్గొన్నారు.