
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఎగువ 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, దిగువ 3 యూనిట్ల నుంచి 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ప్రాజెక్టుకు వరద పెరిగితే 11 యూనిట్ల నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడతామని.. ప్రస్తుతం 17 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు వివరించారు.
సుంకేసులకు కొనసాగుతున్న వరద..
రాజోళి: మండలంలోని సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం ఎగువ నుంచి వరద నీటి రాక కొనసాగుతోంది. 4,504 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఒక గేటు తెరిచి 4,345 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులను వదులుతున్నట్లు జేఈ మహేంద్ర వివరించారు.
ఏడు యూనిట్లలో 276 మెగావాట్లు
17 వేల క్యూసెక్కుల నీటి వినియోగం