● అడిషనల్ డీఆర్డీఓ కృపాకర్
ఏటూరునాగారం: ఉపాఽధిహామీ పథకాన్ని ఒక ఉద్యమంలా రెండు నెలల పాటు చేపట్టాలని అడిషనల్ డీఆర్డీఓ కృపాకర్ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులపై రివ్యూ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామపంచాయతీలో ఉపాధి పనులను ప్రారంభించి త్వరితగతిన కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. పనులు ముమ్మరంగా సాగేలా సర్పంచ్లు, కార్యదర్శులు, ఏపీవో, ఈసీ, టీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలని సూచించారు.


