
పకడ్బందీగా ‘అభయ మిత్ర భరోసా’
ఏటూరునాగారం: దేశంలో యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కువగా పొగాకు వంటి పదార్థాలకు బానిసలై కేన్సర్ బారిన పడుతున్నారు. ఇదే కాకుండా మత్తులో ఉండి ప్రాణాంతకమైన చర్యలకు పాల్పడుతూ యువత నిండు నూరేళ్ల జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే జి ల్లాలోని యువత డ్రగ్స్కు బానిసలు కావొద్దని పోలీ సుశాఖ పిలుపు నిచ్చింది. ఈ మేరకు జిల్లాలో స్పెష ల్ డ్రైవ్స్ చేపట్టారు. ఎస్పీ శబరీశ్ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు మండలాల వారీగా మత్తు పదార్థాలపై అవగాహన సదస్సులతో పాటు వ్యాసరచన పోటీలు, యువతకు ప్రత్యేకమైన దిశా నిర్ధేశాలు చేశారు. వారిలో చైతన్యం నింపడానికి క్షేత్రస్థాయిలో పోలీసులు పర్యటనలు చేస్తున్నారు.
గుట్కాలు నిషేధం
జిల్లాలో విద్యాలయాలకు సంస్థల ఆవరణలకు వంద గజాల వరకు సిగరేట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులను పోలీసులు నిషేధించారు. విరుద్దంగా పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే 2003 చట్టం ప్రకారం జువైనెల్ జస్టిస్(కేర్ ఆండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ 2015 ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీస్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కువగా మద్యం, సిగరెట్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకటనలు చేయడంతో పాటు సమీపంలోని షాపులకు నోటీసులను జారీ చేసి ఖాళీ చేయించే పనిలో పడ్డారు. అంతే కాకుండా నూతనంగా క్యూఆర్ కోడ్లతో పలు సోషల్ మీడియా యాప్స్ను లింక్ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి డ్రగ్స్ రాకెట్ ఉందని, ఎక్కడ విక్రయాలు జరుగుతున్నాయనే విషయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలోని యువతను పోలీసులు అప్రమత్తం చేసే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను రూపొందించింది. వాటిని జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నారు.
ముగింపు వేడుకలు
జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంతో పాటు ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిద్వారా ప్రజలు, యువత, విద్యార్థుల్లో డ్రగ్స్తో కలిగే నష్టాలు, భావితరాలతో భవిష్యత్ ఏ విధంగా క్షీణించిపోతుందని వివరించనున్నారు.
నేటితో ముగియనున్న వారోత్సవాలు
ఊరువాడ ఏకం చేసిన పోలీసులు

పకడ్బందీగా ‘అభయ మిత్ర భరోసా’