
వ్యాధుల నియంత్రణకు కృషి
ములుగు రూరల్: క్షయ వ్యాధి నిర్మూలన, కీటక జనిత వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ టిఎస్. దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ప్రతీ గ్రామంలో వనరబుల్ గ్రూప్స్ వ్యక్తులను గుర్తించి వారంలో రెండు రోజులు క్యాంపు మోడ్ మొబిలైజేషన్ ద్వారా ఆర్బీఎస్కే వాహనాలు తీసుకొచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏటూరునాగారం, ములుగు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఎక్స్రేతో పాటు సిబినాట్ పరీక్షలు చేయించాలన్నారు. క్షయవ్యాధి గ్రస్తులకు పోషకాహారం అందించే దిశగా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆశ కార్యకర్తలు ఫీవర్ సర్వే, డ్రై డే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, డీపీఓ దేవరాజ్ పాల్గొన్నారు.
పర్యావరణ క్విజ్ పోటీలు
నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీలు(ఎన్ఎస్పీసీ)–2025 కు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్ఎస్పీసీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలి, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, వ్యర్థాలు వేరు చేసే అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. హరిత్–ధీవే ఆఫ్ లైఫ్ అనే థీమ్పై దేశ వ్యాప్తంగా పోటీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పోటీలను కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖ సహాయ సహకారంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్విజ్ నిర్వహించనున్నట్లు వివరించారు. 1వ తరగతి నుంచి 5, 6, 8, 9వరకు, 12వ తరగత నుంచి డిగ్రీ, పీజీ పరిశోధన విద్యార్థులను ఐదు విభా గాలుగా విభజించవచ్చని వివరించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ సెల్ నంబర్లో 9912342270 సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కో ఆర్డినేటర్ మల్లారెడ్డి, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, ఈడీ రవి పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర