
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
వెంకటాపురం(కె): విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జీసీడీవో జి.రమాదేవి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, టీచర్స్ ఇయర్ ప్లాన్ను విద్యార్ధుల తరగతి గదులను పరిసరాలను పరిశీలిచారు. ఆనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్తులకు మెరుగైన విద్యను అందిచాలని, విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శిరీష తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్య బోధించాలి
కన్నాయిగూడెం: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం భోజనం అందించాలని జీసీడీఓ రమాదేవి అన్నారు. మండల పరిధిలోని ముప్పనపల్లి వద్ద ఉన్న కేజీబీవీని జీసీడీఓ రమాదేవి ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న ఆహర పదార్ధాలను క్షణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో వారికి అందిస్తున్న విద్యా బోధన, మెనూ ప్రకారం అందిస్తున్నారా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమాదేవి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. పాఠశాల ప్రత్యేక అధికారి అశ్విణికి సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
జీసీడీఓ రమాదేవి

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి