వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

May 27 2025 12:55 AM | Updated on May 27 2025 12:55 AM

వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 31న హైదరాబాద్‌ జలవిహార్‌లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌ లెనిన్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని అరుణ కన్వెన్షన్‌ హాల్‌లో టీయూడబ్ల్యూజే –హెచ్‌ 143 ములుగు జిల్లా కన్వీనర్‌ దూడబోయిన రాకేష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆ విష్కరించారు. అనంతరం లెనిన్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా ములుగు జిల్లా వర్కింగ్‌ జర్నలిస్టులు పనిచేశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్రిడిటేషన్‌ కార్డులను గతంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా పెంచుకున్నామన్నారు. మనమంతా ఐక్యంగా ఉండాలని కోరారు.

సమన్వయ కమిటీ ఎన్నిక

ఏటూరునాగారం సబ్‌ డివిజన్‌ సమన్వయ క మిటీని ప్రకటించారు. ములుగు జిల్లా కో కన్వీనర్లుగా ఎండీ.అఫ్జల్‌, నూక ప్రభాకర్‌, బాచినేని ప్రవీణ్‌, వసంత రమేష్‌, సభ్యులుగా అలువాల శ్రీనివాస్‌, జూపాక కృష్ణ, వేమ సురేష్‌, ఎండీ ఇషాక్‌, పసుపులేటి సతీష్‌, పాషా, కలకోట సంతోష్‌, బేతంచర్ల అ శోక్‌, పర్వతాల లాలయ్య, గంట సర్వేశ్వరరావు, ఠా కూర్‌ ప్రతాప్‌, చల్లగొండ శ్రీకాంత్‌ రెడ్డి లను నియమించారు. కార్యక్రమంలో బోడ సత్యం, గోపి, సుధాకర్‌, మహేష్‌, మల్లేష్‌, షాయక్‌, తిరుమల్‌, రమేష్‌, సాయి, సురేష్‌, దామోదర్‌, వేణు, తదితరులు పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు

బీఆర్‌ లెనిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement