
పంచామృత అభిషేకాలు.. పడిపూజ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయం గత నెల 16న ప్రతిష్టించగా సోమవారానికి 41వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆలయంలో పంచామృత అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అయ్యప్పస్వామి, గణ పతి, సుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, హోమం వేదపండితులు రామకృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి శివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి పడిపూజ నిర్వహించి జ్యోతులు వెలిగించారు. కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ చైర్మన్ గౌరీశంకర్, శ్రీనివాస్, గోపి, లక్ష్మణ్, సత్యం పాల్గొన్నారు.

పంచామృత అభిషేకాలు.. పడిపూజ