పంచామృత అభిషేకాలు.. పడిపూజ | - | Sakshi
Sakshi News home page

పంచామృత అభిషేకాలు.. పడిపూజ

May 27 2025 12:54 AM | Updated on May 27 2025 12:54 AM

పంచామ

పంచామృత అభిషేకాలు.. పడిపూజ

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయం గత నెల 16న ప్రతిష్టించగా సోమవారానికి 41వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆలయంలో పంచామృత అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అయ్యప్పస్వామి, గణ పతి, సుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, హోమం వేదపండితులు రామకృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి శివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి పడిపూజ నిర్వహించి జ్యోతులు వెలిగించారు. కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ చైర్మన్‌ గౌరీశంకర్‌, శ్రీనివాస్‌, గోపి, లక్ష్మణ్‌, సత్యం పాల్గొన్నారు.

పంచామృత అభిషేకాలు.. పడిపూజ1
1/1

పంచామృత అభిషేకాలు.. పడిపూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement