
బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రామ్
ములుగు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రామ్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జగ్జీవన్రామ్ 118వ జయంతి వేడుకలకు అడిషనల్ కలెక్టర్ సంపత్రావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో కులసంఘాల నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ప్రతిఒక్కరూ అనుసరించాలన్నారు. బిహార్లో పుట్టి ఉప ప్రధానిగా ఆయన పనిచేయడం గొప్ప విషయం అన్నారు. ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఘనుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్, ఎంపీడీఓ రామకృష్ణ, ఆయా సంఘాల నాయకులు ఇరుగు పైడిమాదిగ, బుర్రి సతీశ్మాదిగ, మడిపెల్లి శ్యాం, జన్ను రవి, నద్దునూరి రమేష్, మురుకుట్ల నరేందర్, సునార్కాని రాంబాబు, రామునాయక్, చింత కృష్ణ, ముంజాల భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జిల్లాకేంద్రంలో పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. తొలి పార్లమెంట్లో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్సై జగదీశ్, ఉమెన్ ఆర్ఎస్సై నిర్మల, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్పతి, జిల్లా హెడ్క్వార్టర్స్ సూపరింటెండెట్ డాక్టర్ జగదీశ్వర్లు బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితవర్గాల అంటరానితనం నిర్మూలన కోసం, సమానత్వం కోసం పోరాడారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ తిరుపతయ్య, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్

బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రామ్