గిరిజన యువతకు నైపుణ్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

గిరిజన యువతకు నైపుణ్య పరీక్షలు

Mar 30 2023 1:48 AM | Updated on Mar 30 2023 1:48 AM

యువతకు నైపుణ్య పరీక్షలు 
నిర్వహిస్తున్న జిల్లా అధికారి పిల్లి శ్రీపతి - Sakshi

యువతకు నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా అధికారి పిల్లి శ్రీపతి

ములుగు రూరల్‌(గోవిందరావుపేట): గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు బుధవారం యువతకు నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. గోవిందరావుపేట మండల పరిధిలోని కర్లపల్లిలో యువతకు వల విసరడం, వల అల్లికలు, ఈతపై పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి మాట్లాడారు. కర్లపల్లిలో నిర్వహించిన నైపుణ్య పరీక్షల్లో ప్రతి ఒక్కరూ అర్హత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ రమేష్‌, ఐటీడీఏ జిల్లా కో ఆర్డినేటర్‌ కొమురం ప్రభాకర్‌, సర్పంచ్‌ ఈక అంజిబాబు, జీసీసీ డైరెక్టర్‌ పురుషోత్తం, పీసీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ సాయిబాబు, సొసైటీ అధ్యక్షుడు నరేందర్‌, పీసీ మొబిలైజర్‌ కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement