సిరికొండ ప్రత్యేక పూజలు

- - Sakshi

టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ స్వగ్రామమైన పరకాల మండలంలోని నర్సక్కపల్లి నుంచి కోటంచ ఆలయానికి ర్యాలీగా వచ్చి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిక కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీఇచ్చారు.అనంతరం ఆయనను నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కత్తి సంపత్‌, వావిలాల రమేష్‌, గునిగంటి మహేందర్‌, తదితరులు ఉన్నారు.

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top