పాత నేరస్తులపై దృష్టి సారించాలి

మాట్లాడుతున్న భూపాలపల్లి ఎస్పీ సురేందర్‌రెడ్డి   - Sakshi

భూపాలపల్లి: నేరాల నియంత్రణ కోసం అసాంఘిక శక్తులతో పాటు, పాత నేరస్తులపై దృష్టి సారించాలని భూపాలపల్లి ఎస్పీ సురేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. కొత్త కేసులతో పాటు, చాలా కాలంగా పెండింగ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా కృషి చేయాలన్నారు. ఇందుకోసం కోర్టు సంబంధిత అంశాల్లో సమర్థవంతంగా పనిచేసి, శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట బీట్‌లు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని, 100కు కాల్‌చేసిన వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top