Manjula Ghattamaneni: రీఎంట్రీకి రెడీ..

Manjula Ghattamaneni Re Entry With Malli Modalaindi Movie First Look Out - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని.. సిల్కర్‌ స్క్రీన్‌పై మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సుమంత్‌, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతోన్న మళ్లీ మొదలైంది చిత్రం ద్వారా రీఎంట్రీకి సిద్దమయ్యారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజుల 'డాక్టర్ మిత్ర'-థెరపిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మూవీ విడుదల తేదీపై ఎగ్జయిటెడ్‌గా ఉన్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా 1998లో స‌మ్మ‌ర్ ఇన్ బెత్తెహామ్ సినిమాతో తొలిసారి వెండితెరకు  కనిపించిన మంజుల ఆ తర్వాత నాని సినిమాతో నిర్మాత‌గా మారింది. పోకిరి, కావ్యాస్ డైరీ, యే మాయ చేశావే చిత్రాల‌ను నిర్మించి సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందింది ఆ తర్వాత 2018లో మ‌న‌సుకు న‌చ్చింది సినిమాకు దర్శకత్వం వహించింది. చివరగా 2013లో సేవకుడు చిత్రంలో కనిపించారు. మళ్లీ దాదాపు ఎనిమిదేళ్ల అనంతరంనటిగా వెండితెరపై కనిపించనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top