Keerthy Suresh Completes Dubbing For Sarkaru Vaari Paata Movie - Sakshi
Sakshi News home page

Keerthy Suresh : 'సర్కారు వారి పాట' డబ్బింగ్‌ పూర్తి చేసిన కీర్తి సురేష్‌

May 2 2022 11:50 AM | Updated on May 2 2022 3:15 PM

Keerthy Suresh Completes Dubbing For Sarkaru Vaari Paata Movie - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు.  రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా డబ్బింగ్‌ పూర్తి చేసింది. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దగ్గరుండి కీర్తి సురేష్ చేత డైలాగ్స్ చెప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసిన కీర్తి సర్కారు వారి పాట సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. చదవండి: 'ప్రేమ'పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన కృతిశెట్టి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement