అదనపు కలెక్టర్ నగేశ్
రామాయంపేట(మెదక్): ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం స్థానిక రైతు వేదికలో మండలస్థాయి సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి సురేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, పలు గ్రామల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్లు ముందుకెళ్లాలని సూచించా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయమై చిత్తశుద్ధితో పని చేయాల్సి అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సజీలుద్దీన్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


