వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ
ఛత్రపతి శివాజీ వీరత్వానికి ప్రతీక అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం పట్టణంలో శివాజీ మహరాజ్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. మరాఠా ప్రజల్లో శివాజీ స్వేచ్ఛా స్ఫూర్తిని రగిలించి, శక్తివంతమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. ఆయన వెంట ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు ఉన్నారు. కాగా అంతకుముందు వీహెచ్పీ, బీజేపీ, భజ్రంగ్దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ త దితరులు పాల్గొన్నారు. – మెదక్ కలెక్టరేట్


