
నాణ్యమైన భోజనం అందించాలి
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థులకు మెనూ ప్రకారం, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని అదేశించారు. ఆదివారం అల్లాదుర్గంలోని ఎస్సీ బాలుర వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. బాత్రూంలు అధ్వానంగా ఉండటంతో వెంటనే నిధులు మంజూరు చేస్తానని, పనులు ప్రారంభించాలని వార్డెన్కు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రోగుల వివరాలు తెలుసుకున్నారు. సీజన్ల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉన్నాయా..? అని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. వానాకాలం సీజనల్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్లాదుర్గం కేజీబీవీలో సిబ్బంది, విద్యార్థినులు లేకపోవడంతో వెనుదిరిగారు.
అర్హులందరికీ రైతుభరోసా
టేక్మాల్(మెదక్): అర్హుందరికీ రైతు భరోసా డబ్బు లు జమ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆదివారం మండలంలోని ఎల్లంపల్లి తండాలో పత్తి పంటను పరిశీలించారు. జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో 2,54,504 మంది రైతుల ఖాతాల్లో రూ. 207.14 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
కలెక్టర్ రాహుల్రాజ్