‘కూత’ వేటు దూరంలో.. | - | Sakshi
Sakshi News home page

‘కూత’ వేటు దూరంలో..

Jun 22 2025 7:18 AM | Updated on Jun 22 2025 7:18 AM

‘కూత’ వేటు దూరంలో..

‘కూత’ వేటు దూరంలో..

● తుది దశకు కొమురవెల్లిరైల్వే స్టేషన్‌ పనులు ● దసరాకు ప్రారంభిస్తామనికేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభం ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న భక్తులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి యేటా మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి భక్తులు వస్తుంటారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్‌ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే లైన్లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ వద్ద రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయా లని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. దీంతో రైల్వేశాఖ స్పందించి స్టేషన్‌ మంజూరు చేయగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌తో కలసి 2024 ఫిబ్రవరి 15న భూమి పూజచేసి పనులను ప్రారంభించారు. స్టేషన్‌, ప్లాట్‌ఫాం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దసరాకు కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభిస్తామని ఇటీవల కిషన్‌రెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement