
జిల్లాలో 25 వేల దరఖాస్తులు: కలెక్టర్
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామసభల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, రెండు నెలల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మడూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించలేని సమయంలో వారికి లిఖిత పూర్వకంగా సమా ధానం ఇస్తామన్నారు. శనివారం సైతం మ డూర్లో గ్రామ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. యూనిఫాం, పుస్తకాలు అందాయా అని ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
మెదక్జోన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించే యోగా వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా చక్కటి ఔషదం అన్నారు.