
కష్టపడి చ దివితేనే భవిష్యత్తు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
పాపన్నపేట(మెదక్)/నర్సాపూర్ రూరల్: కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని జక్కపల్లి మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి పిల్లల కోసం మోడల్ స్కూల్స్, గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాలలో తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్, బస్సుల సౌకర్యం వంటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శేఖర్, సత్యంగౌడ్, భిక్షపతి, జితేందర్రెడ్డి, ఆంజనేయగౌడ్, శ్రీనివాస్రెడ్డి, జగన్, హుస్సేన్, ప్రసాద్, ప్రిన్సిపాల్ ఫర్హాన తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.