![OòܺƊḥæ¯ólÆ>ËOò³ A{ç³Ð]l$™èl¢…V> E…yéÍ](/styles/webp/s3/article_images/2025/06/20/19mdk21-350072_mr-1750382239-0.jpg.webp?itok=aEpYgQDe)
OòܺƊḥæ¯ólÆ>ËOò³ A{ç³Ð]l$™èl¢…V> E…yéÍ
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలని, తక్కువ సమయంలో ఎక్కువ లాభం అంటే మోసమని గ్రహించి అవగాహనతో వ్యవహరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి అకౌంట్ వివరాలు అడిగితే చెప్పకూడదన్నారు. బ్యాంకు అధికారులు ఎప్పుడు సమాచారాన్ని కాల్ చేసి అడగరని తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్, యాప్ సృష్టించి ఎక్కువ లాభాలు చూపించి మోసం చేస్తారని, అలాంటివి నమ్మి మోసపోవద్దని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్టౌన్ సీఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.