ఆ ఐదున్నర కిలోమీటర్లు | - | Sakshi
Sakshi News home page

ఆ ఐదున్నర కిలోమీటర్లు

Jun 20 2025 6:49 AM | Updated on Jun 20 2025 6:53 AM

(765 డీజీ) ఎన్‌హెచ్‌ విస్తరణకు ఆటంకాలు

త్వరలో అనుమతులు

మెదక్‌, రామాయంపేట మధ్య అటవీ ప్రాంతంలో ఆ శాఖ అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈవిషయమై అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లా. త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అక్కన్నపేట వద్ద ఇద్దరు రైతులు కోర్టులో కేసు వేయడంతో ఆటంకం ఏర్పడింది.

– రఘునందన్‌రావు, ఎంపీ, మెదక్‌

రామాయంపేట(మెదక్‌): మూడు జిల్లా కేంద్రాలను కలుపుతూ కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు, కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో మెదక్‌– రామాయంపేట మధ్య అటవీ ప్రాంతంలో నాలుగున్నర కిలోమీటర్లు, అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ వద్ద కిలోమీటర్‌ మేర రహదారి విస్తరణ పనులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

రెండుసార్లు ప్రతిపాదనలు

మెదక్‌, సిద్దిపేట, వరంగల్‌ జిల్లా కేంద్రాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గతంలో నిధులు మంజూరు చేసింది. మెదక్‌ నుంచి సిద్దిపేట వరకు ఒక బిట్టు, సిద్దిపేట నుంచి వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి వరకు మరో బిట్టుగా జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మెదక్‌, సిద్దిపేట మధ్య రూ. 882 కోట్లు మంజూరు కాగా, అటవీ ప్రాంతంలో అక్కన్నపేట వద్ద మినహా మిగితా చోట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నా యి. మెదక్‌, రామాయంపేట మధ్య నాలుగున్నర కిలోమీటర్ల మేర అటవీ విస్తరించి ఉంది. అనుమతుల కోసం జాతీయ రహదారుల శాఖ అధికారులు అటవీశాఖ కేంద్ర విభాగానికి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు అధికారులు రోడ్డు విస్తరణలో కోల్పోయే చెట్ల వివరాల కొలతలు సేకరించారు. వారి సూచనల మేరకు అటవీ ప్రాంతం గుండా రహదారికి ఇరువైపులా రోడ్డు విస్తరణ పరిధి తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. అయితే రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. అక్కన్నపేట వద్ద రైల్వేలైన్‌ కింది భాగంలో బ్రిడ్జి నిర్మాణంతో పాటు సుమారు కిలోమీటర్‌ మేర భూమి లోపలి భాగం నుంచి రోడ్డు నిర్మించాల్సి ఉంది. రైల్వేశాఖ నుంచి అనుమతులు వచ్చినా గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోర్టులో కేసు వేయడంతో పనులు నిలిచిపోయాయి.

అటవీ ప్రాంతంలో నిలిచిన రోడ్డు విస్తరణ

అడ్డంకిగా మారిన అటవీశాఖఅనుమతులు

మూడేళ్లుగా నిలిచిన పనులు

బైపాస్‌ రోడ్డు సర్వే పూర్తి

రామాయంపేట బైపాస్‌ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు ఏడాదిగా సర్వే పనులు అడ్డుకున్నారు. బైపాస్‌ రోడ్డు కాకుండా ప్రస్తుతం ఉన్న మార్గంలోనే రహదారి నిర్మించాలని పట్టుపట్టారు. దీంతో పలుమార్లు ఎంపీ రఘునందన్‌రావు వారిని సముదాయించి, అందరికీ న్యాయమైన నష్టపరిహారం ఇప్పిస్తామని నచ్చజెప్పి సమస్య పరిష్కరించారు.

ఆ ఐదున్నర కిలోమీటర్లు1
1/2

ఆ ఐదున్నర కిలోమీటర్లు

ఆ ఐదున్నర కిలోమీటర్లు2
2/2

ఆ ఐదున్నర కిలోమీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement