
మోదీతోనే దేశంలో సుపరిపాలన
నర్సాపూర్: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశంలో సుపరిపాలన అందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని పిల్లల పార్కులో నిర్వహించిన రచ్చబండలో పాల్గొని మాట్లాడారు. మోదీ 11 ఏళ్ల పాలనలో పేదలు, రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేశారని కొనియాడారు. అలాగే పర్యావరణవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ను పురస్కరించుకొని ఈనెల 23 నుంచి జూలై 6వ తేదీ వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, నాయకులు రమేష్గౌడ్, చంద్రయ్య, రాంరెడ్డి, నారాయణరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాటేజీలు మంజూరు చేయండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయలకు 30 కాటేజీలు మంజూరు చేయాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏడుపాయలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. 2008లో అప్పటి మంత్రి గీతారెడ్డి రూ. 1.50 కోట్లు మంజూరు చేసి కాటేజీలు ఏర్పాటు చేశారని చెప్పా రు. ప్రస్తుతం భక్తులకు సరిపడా సత్రాలు లేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇప్పటికై నా కాటేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
రామాయంపేట(మెదక్): రామాయంపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శిరీష సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కళాశాలలో బీకాం, బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈనెల 23వ తేదీలోగా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహిళలు ధైర్యంగాముందుకు సాగాలి
చిలప్చెడ్(నర్సాపూర్): మహిళలు ధైర్యంగా ముందుకు సాగుతూ, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా మహిళా సాధికారిత టీం మిషన్ సమన్వయకర్త సంతోషి అన్నారు. మండల పరిధిలోని గౌతాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి బేటీ బచావో, బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ, ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. మహిళల సంరక్షణకు తమ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత సిబ్బంది కవిత, నాగమణి, పాఠశాల హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

మోదీతోనే దేశంలో సుపరిపాలన