
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
బారులు తీరి.. అర్జీలు ఇచ్చి
రాయిలాపూర్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు రైతులు పోటెత్తారు. బారులు తీరి దరఖాస్తులు అందజేశారు. తాము 50 ఏళ్లుగా కాస్తులో ఉన్నా, పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని తహసీల్దార్ రజనికుమారికి వినతిపత్రం అందజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మెదక్ వచ్చినప్పుడు గ్రామ శివారులోని 881 సర్వే నంబర్లో పట్టాలిచ్చారని గుర్తుచేశారు. పాస్ పుస్తకాల కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా రాలేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ.. బాధిత రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
– రామాయంపేట(మెదక్)