భూ సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

Jun 20 2025 6:49 AM | Updated on Jun 20 2025 6:49 AM

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

శివ్వంపేట(నర్సాపూర్‌)/పెద్దశంకరంపేట(మెదక్‌): భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. మండల పరిధిలోని నవాబుపేటలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. 30 ఏళ్లుగా గ్రామంలో పొలాలు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రైతులు విన్నవించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించి తలెత్తిన సమస్యను ఇరుశాఖలతో కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్హులైన రైతులందరికీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చాకరిమెట్ల ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ కమలాద్రి, సిబ్బంది ఉన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులు భూ సమస్యలపై అందించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement