
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
చిన్నశంకరంపేట(మెదక్): రైతులు ఆయిల్పామ్ సాగును సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రైతు కిష్టయ్య వ్యవసాయ పొ లంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం అందిస్తున్న ఆయిల్పామ్ సాగుకు రైతులు మొగ్గుచూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్, ఏఓ ప్రవీణ్, ఏఈఓ మధులిక, ఫీల్డ్ ఆఫీసర్ సుజాత, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
మెదక్జోన్: వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 12 ఐసోలేషన్ పడకలతో కూడిన వార్డును ప్రారంభించి మాట్లాడారు. కోవిడ్ సంబంధిత కేసులను ఎదుర్కొవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతాదేవి, ప్రొఫెసర్ లోకేష్తో పాటు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.