పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Jun 20 2025 6:49 AM | Updated on Jun 20 2025 6:49 AM

పేదల సొంతింటి కల సాకారం

పేదల సొంతింటి కల సాకారం

నర్సాపూర్‌: మాది పేదల ప్రభుత్వమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ అన్నారు. గురువారం నర్సాపూర్‌లోని పలు వార్డులకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటితో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ కాలంలో పేదలకు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి ప్రొటోకాల్‌పై ఉన్న ధ్యాస పేదలకు సేవ చేయడంలో లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో భూ ఆక్రమణలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లు రాని వారు ఆందోళన చెందొద్దని, ఇంకా మూడు పర్యాయాలు కేటాయిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ రాజుయాదవ్‌, నాయకులు మల్లేష్‌, చిన్న ఆంజిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement