
ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి
కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి మొత్తం 85 అర్జీలు రాగా, అత్యధికంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావుతో పాటు జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పీఎం దర్తి అభజన్ భాగీధారి అభయాన్ పథకంపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహంచారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకానికి జిల్లాలోని 10 మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆధార్, రేషన్ కార్డ్, కుల సర్టిఫికెట్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భవ తదితర ఫథకాలు పొందలేని వారిని గుర్తించనున్నట్లు వివరించారు. వీరికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. అధికారులు ఈ పథకంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.