పంటల సాగులో మెలకువలు అవసరం | - | Sakshi
Sakshi News home page

పంటల సాగులో మెలకువలు అవసరం

Jun 17 2025 6:55 AM | Updated on Jun 17 2025 6:55 AM

పంటల సాగులో మెలకువలు అవసరం

పంటల సాగులో మెలకువలు అవసరం

నర్సాపూర్‌ రూరల్‌/కౌడిపల్లి: రైతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ నగేష్‌ అన్నారు. సోమవారం మండలంలోని అవంచ, లింగాపూర్‌ రైతు వేదికలలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను విని పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్‌, ఏఓ దీపిక, ఏఈఓలు చంద్రవేణి, దుర్గాప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని తునికి రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా రైతులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని విన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement