
రాజీయే రాజమార్గం
నర్సాపూర్: కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయం వృథా చేసుకోవడం కంటే ఇరువర్గాలు రాజీపడి కలిసిమెలిసి జీవించాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత హితవు పలికారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని మాట్లాడారు. రాజీ చేసుకో తగిన కేసుల్లో ఇరువర్గాలు కోప తాపాలు మర్చిపోయి రాజీ కుదుర్చుకోవడం ఉత్తమమని చెప్పారు. అనంతరం పలు కేసులను పరిష్క రించారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవేందర్, ప్రభుత్వ సహాయ న్యాయవాది సుధాకర్ న్యాయవాదులు శ్రీనివాస్గౌడ్, మధుశ్రీ, సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ లింగం తదితరులు పాల్గొన్నారు.
55 సార్లు రక్తదానం
రామాయంపేట(మెదక్): అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన శిబిరంలో శనివారం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఏలేటి రాజశేఖర్రెడ్డి 55వసారి రక్తదానం చేశారు. ఈసందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రశంసించి సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు జిల్లాకు చెందిన రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
‘ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి’
మెదక్ కలెక్టరేట్: సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 17న జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నా యకులు విజయేంద్రసాగర్, కుమారస్వామి, నర్సింలు, రమేష్గౌడ్, బండి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
19న వానాకాలంసాగుపై సెమినార్
మెదక్ కలెక్టరేట్: ఈనెల 19న జరిగే వానాకాలం సాగుపై సెమినార్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను శనివారం కేవల్ కిషన్ భవన్లో ఆవిష్కరించి మాట్లాడారు. వ్యవసాయ రంగం.. ఎదుర్కొంటున్న సవాళ్లు అంశంపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే అరిబండి ప్రసాద్రావు రచించిన ‘నేను మన భూమి.. ఒక జీవన స్మతి’ పుస్తకాని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. అనంతరం వానాకాలం సాగు– తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై సెమినార్ జరుగుతుందన్నారు. సెమినార్కు శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ విజయకుమార్, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు.

రాజీయే రాజమార్గం