
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
ఎంపీ రఘునందన్రావు
శివ్వంపేట(నర్సాపూర్): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మండలంలోని పెద్దగొట్టిముక్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రహరి నిర్మాణానికి రూ. 10 లక్షలు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శివ్వంపేటలో కేంద్ర ప్రభుత్వ స్థలం ఉన్నందున తపాలా కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకుడు వినోద్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్గుప్తా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొండల్రావు, మాజీ కౌన్సిలర్ సురేష్, మండల అధ్యక్షుడు రవి, నాయకులు నారాయణరెడ్డి, అంజనేయులుగౌడ్, భిక్షపతి, అశోక్, ఆంజనేయులు, నర్సింహారెడ్డి, నర్సింలు పాల్గొన్నారు.