
తాటి ముంజ.. తింటే మజా
అల్లీపూర్లో ఆహ్లాదాన్ని
పంచుతున్న తాటివనం
చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో పొడవైన తాటి చెట్లతో శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామం ఆహ్లాదాన్ని పంచుతుంది. అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే తాటి ముంజలకు కేరాఫ్గా నిలుస్తోంది. చెట్ల నుంచి వచ్చే కల్లును గీసి విక్రయించి ఏడాది పొడవునా గీత కార్మికులు జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా వేసవిలో చెట్లకు కాసే తాటి ముంజలను విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ఏటా ఏప్రిల్, మే మాసంలో ఆటోల్లో శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాలకు తరలించి 100 రూపాయలకు డజను చొప్పున తాటి ముంజలను విక్రయిస్తున్నారు. వేసవిలో శీతల పానియాలకు బదులుగా తాటి ముంజలను తినడం మేలని, వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
– శివ్వంపేట(నర్సాపూర్)

తాటి ముంజ.. తింటే మజా

తాటి ముంజ.. తింటే మజా