ఓటమి గెలుపునకు నాంది | - | Sakshi
Sakshi News home page

ఓటమి గెలుపునకు నాంది

May 1 2025 7:29 AM | Updated on May 1 2025 7:29 AM

ఓటమి

ఓటమి గెలుపునకు నాంది

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది పలుకుతుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫెయిల్‌ అయిన 300 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధన చేయిస్తామని తెలిపారు. గతేడాది జిల్లా 18వ స్థానంలో నిలవగా, ఈసారి ఇతర జిల్లాలకు పోటీగా 12 స్థానంలో నిలవడం హర్షణీయమన్నారు. ఈసందర్భంగా డీఈఓ రాధాకిషన్‌, సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు అధైర్య పడకుండా ప్రత్యేక తరగతులకు హాజరై సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల పరిధిలోని ముత్తాయికోటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా తేమశాతం, ఎంత తూ కం వేస్తున్నారు..? ఏమైనా ఇబ్బందులు ఉన్నా యా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యంను ఆరబోసి అధికారులు సూచించిన తేమశాతం పాటించాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

3, 4 తేదీల్లో సీఐటీయూ జిల్లా మహాసభలు

రామాయంపేట(మెదక్‌): ఈనెల 3, 4 తేదీల్లో రామాయంపేటలో సీఐటీయూ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా ప్రతినిధి మల్లేశం తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు. దీంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని మండిపడ్డారు. బీడీ కట్టపై పుర్రె గుర్తుతో బీడీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిందన్నారు. కార్మికులకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ లేదని, జిల్లాలో పీఎఫ్‌ కార్యాలయం లేకపోవడంతో వారు ఇబ్బందిపడుతున్నారని వాపోయారు. మహాసభల నేపథ్యంలో ఈనెల 4వ తేదీన రామాయంపేటలో కార్మికులతో భారీ స్థాయి ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా నాయకురాలు బాలమణి తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ

మనోహరాబాద్‌(తూప్రాన్‌): మండలంలోని కాళ్లకల్‌ గ్రామానికి చెందిన హర్షగౌడ్‌ కులం పేరుతో దూషిస్తూ దాడి చేశాడని అదే గ్రామానికి చెందిన కనిగిరి రాజు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి సాక్షులు, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపించి వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

పోరాట ఫలితమే

అంగన్‌వాడీలకు సెలవులు

మెదక్‌ కలెక్టరేట్‌: సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం మే నెల సెలవులు ప్రకటించిందని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నపూర్ణ, నర్స మ్మ అన్నారు. బుధవారం మెదక్‌లో వారు మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఐసీడీఎస్‌ 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మే నెలంతా సెలవులు ప్రకటించడంపై సంతోషం వ్య క్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్‌వాడీలు సిద్ధం కా వాలని పిలుపునిచ్చారు.

సిద్దిపేట మున్సిపాలిటీ రికార్డు

సిద్దిపేట జోన్‌: సిద్దిపేట మున్సిపాలిటీ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఇంటి పన్ను రాయితీలో బుధవారం ఒక్క రోజే కోటి 5 లక్షల రూపాయలు చెల్లించి ప్రజలు పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఓటమి గెలుపునకు నాంది 
1
1/2

ఓటమి గెలుపునకు నాంది

ఓటమి గెలుపునకు నాంది 
2
2/2

ఓటమి గెలుపునకు నాంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement