
హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలో విఫలం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్
కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్ విమర్శించారు. మంగళవారం కౌడిపల్లిలోని బాలికల హాస్టల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల హాస్టల్లో సరైన వసతులు లేవని, పరిశుభ్రత లోపించిందని చెప్పారు. లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్స్ సరిగా లేవన్నారు. కిచెన్లో కనీసం ఫుడ్ లేదన్నారు. ఇలాంటప్పుడు విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సన్నబియ్యం గురించి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. హాస్టల్లో భోజనం చేస్తే సమస్య తెలుస్తుందని చెప్పారు. 32 మంది అనారోగ్యం బారిన పడితే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు హాస్టల్ వైపు చూడలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మండల అధ్యక్షుడు రాకేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ నిర్వహణపై
ఆర్డీఓ అసహనం
కౌడిపల్లి(నర్సాపూర్): కిచెన్లో దుర్వాసన వస్తుంది.. టాయిలెట్స్ బాగా లేవు.. పరిసరాలు పరిశుభ్రంగా లేవు.. మొత్తం హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో గల ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని ఆర్డీఓ తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, టాయిలెట్స్, కిచెన్తోపాటు పరిసరాలను తనిఖీ చేశారు. కిచెన్, హాస్టల్ పరిసరాలు శుభ్రం చేయడంలేదా అని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా నిధులు ఇస్తున్నప్పటికీ పరిసరాలు శుభ్రం చేయకుండా, చిన్ని చిన్న మరమ్మతులు చేయకపోతే ఎలాగన్నారు. సరిపోను గదులు ఉన్నా కేవలం నాలుగు మాత్రమే వాడుతున్నారని మిగితా గదులు ఎందుకు వాడటంలేదని వార్డెన్ను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆందోళన లేకుండా శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల గురించి మండల వైద్యాధికారి శ్రీకాంత్ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, ఏఎస్డబ్ల్యూఓ పద్మజ, వార్డెన్ సర్సమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
అంబేడ్కర్
ఆశయాలు ఆదర్శం
ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద
మెదక్ కలెక్టరేట్: కోర్టు ప్రాంగణంలో మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మిశార ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఇతర న్యాయమూర్తులు రూబినా, సౌజన్య, సాయి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
18న ఖేడ్లో ముస్లింల ప్రదర్శన
నారాయణఖేడ్: వక్ఫ్ చట్ట సవరణను నిరసిస్తూ ఖేడ్లో ఈనెల 18న నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు పట్టణ ముస్లిం పెద్దలు తాహెర్ అలీ, షబ్బీర్ సాబ్, మాజీద్, ముస్లిం యాక్షన్ కమిటీ బాధ్యులు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం మసీదులలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆర్డీవో, తహసీల్దార్కు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతి పత్రాలు అందజేస్తామన్నారు.

హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలో విఫలం

హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలో విఫలం