బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ రమేష్‌ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ రమేష్‌

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా తన్నీరు రమేష్‌ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న కమిషనర్‌ సంపత్‌రెడ్డి ములుగు మున్సిపాల్టీకి బదిలీ కాగా, అక్కడ కమిషనర్‌గా ఉన్న రమేష్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు సంపత్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన కమిషనర్‌ రమేష్‌కు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాగా, మున్సిపల్‌ ఎన్నికలకు ముందు బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఇక్కడ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement