వసతులు కల్పించాలంటూ ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

వసతులు కల్పించాలంటూ ఫిర్యాదు

Jun 23 2025 6:49 AM | Updated on Jun 23 2025 6:49 AM

వసతులు కల్పించాలంటూ ఫిర్యాదు

వసతులు కల్పించాలంటూ ఫిర్యాదు

నస్పూర్‌: పట్టణ పరిధిలోని సీసీసీ కార్నర్‌ వద్ద గల తిరుమల డెవలపర్స్‌ అపార్ట్‌మెంట్‌లో మౌలిక వసతులు కల్పించడం లేదంటూ యజమానులపై అపార్ట్‌మెంట్‌ వాసులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమానులు అనుమల్ల వెంకట్‌రెడ్డి, పెరుక ప్రతాప్‌, గుజ్జల ప్రశాంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట అపార్ట్‌మెంట్‌ వాసులు మాట్లాడుతూ 2013లో నస్పూర్‌ శివారు సర్వేనంబర్‌ 94లో తిరుమల డెవలపర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపార్ట్‌మెంట్‌లో మొత్తం 48 ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా లిఫ్ట్‌లు, కౌంపౌండ్‌ వాల్‌, సీసీ కెమెరాలు, మెట్ల పక్కన రెయిలింగ్‌ ఏర్పాటు చేయలేదని, ఎర్తింగ్‌ లేదని, ఫ్లోరింగ్‌ అసంపూర్తిగా ఉందన్నారు. అపార్ట్‌మెంట్‌ వాసులు లక్ష్మారెడ్డి, రాంచందర్‌, సత్తయ్య, లక్ష్మి, భవాని, పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement