
బ్లేడ్ ట్రాక్టర్ తగిలి మహిళా రైతు మృతి
పెంబి: చేనులో చదును చేస్తున్న బ్లేడ్ ట్రాక్టర్ వెనుకకు వచ్చే క్రమంలో నాగలికి తగలి మహిళా రైతు అక్కడిక్కడే మృతి చెందింది. మండలంలోని నాగాపూర్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై హన్మండ్లు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన పోతురాజు లక్ష్మి(40) తన చేనులో ఆదివారం బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేయిస్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో వెనుకకు వచ్చే క్రమంలో నాగలి ఆమె తలకి తగలి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అనుప ఎల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కూతురు ఉంది. భర్త, కుమారుడు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.