
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
చెన్నూర్రూరల్: వృద్ధురాలి మెడలో గొలు సును ఇద్దరు చోరీకి పాల్పడ్డారు. మండలంలోని సుబ్బరాంపల్లి సమీపంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబ్బరాంపల్లి గ్రామానికి చెందిన రాతిపల్లి భూదమ్మ శనివారం పని నిమిత్తం అంగ్రాజ్పల్లి గ్రామానికి వెళ్లింది. అక్కడకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి మీతో పని ఉందని మీ ఊరికే వెళ్తున్నామని చెప్పి నమ్మించారు. బైక్పై తీసుకుని సుబ్బరాంపల్లి సమీపంలో దించి ఆమె మెడలో మూడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. భూదమ్మ గట్టిగా అరవడంతో ఇద్దరు బైక్పై పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యులు చెన్నూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.